అస్సాం వరదల్లో 7 గురి మృతి

By udayam on May 17th / 10:46 am IST

అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 7 గురు మరణించారని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 2,02,385 మంది ప్రజలు ఉన్న ఇళ్ళను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని తెలిపారు. ఇక్కడి హొజాయి, కచర్​ ప్రాంతాలు భారీ వర్షాల ధాటికి అతలాకుతలం అయిపోయాయని తెలిపారు. చరైదో, డర్రాంగ్​, ధేమాజి, దిబ్రూగర్​, దిమా–హసావో ప్రాంతాలనూ వరదలు పోటెత్తాయని తెలిపారు. మొత్తం 20 జిల్లాల్లోని 652 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయని తెలిపారు.

ట్యాగ్స్​