ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకూ భారత్ తో జరిగే 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా అప్పుడే తన తుది జట్టును ప్రకటించింది. మొత్తం 18 మంది జట్టులో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఆస్టన్ అగర్, స్కాట్ బొలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్ కాంబ్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, లాన్స్ మోరిస్, టాడ్ ముర్ఫీ, రెన్ షా, స్టీవ్ స్మిత్, స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ లకు చోటు దక్కింది.