ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆసీస్ కొత్త ప్రతిపాదన చేసింది. దాయాది దేశాల మధ్య టెస్ట్ సిరీస్ కు తాము ఆతిధ్యం ఇస్తామని ఆఫర్ చేసింది. ఈ మేరకు విక్టోరియా ప్రభుత్వం.. క్రికెట్ ఆస్ట్రేలియాతో జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో 90 వేల మంది పట్టే స్టేడియంలో ఈ మ్యాచ్ ను నిర్వహిస్తామని ఆస్ట్రేలియా చెప్పుకొచ్చింది. దీనిపై భారత్, పాక్ క్రికెట్ బోర్డ్ ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.