విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం అయ్యప్ప స్వాములు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. తాము రిజర్వేషన్ చేసుకున్న కొల్లం ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఎస్ 7, 8, 9 కోచ్ లు లేవంటూ అధికారులను నిలదీశారు. అనంతరం ట్రైన్ కదలకుండా 250 మంది స్వాములు పట్టాలపై కూర్చున్నారు. అప్పటికి గానీ చలనం రాని అధికారులు ప్రయాణికులు క్షమాపణలు చెప్పి మూడు కోచ్ లను కొల్లం ట్రైన్ కు జత చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.