ఐపిఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు అదరగొట్టేసింది. ఆ జట్టు ప్లేయర్ పటిదార్ (112*) సెంచరీతో కదం తొక్కిన వేళ లక్నో సూపర్ కింగ్స్ తుది వరకూ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివర్లో కార్తీక్ 37 పరుగులతో రెచ్చిపోయాడు. ఆపై ఛేదనలో లక్నోకు రాహుల్ 79, దీపక్ హుడా 45 తో ఆదుకున్నా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 193 పరుగులతో సరిపెట్టుకుంది. బెంగళూరు ఫైనల్ చేరాలంటే రాజస్థాన్తో 2వ క్వాలిఫయర్లో తలపడాల్సి ఉంది.