బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ కు 254 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఈరోజు 133 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను మొదలెట్టిన బంగ్లా బ్యాటర్లు మరో 17 పరుగులు జత చేసి చివరి 2 వికెట్లు కోల్పోయారు. కుల్దీప్ యాదవ్ 5, సిరాజ్ 3, ఉమేష్, అక్షర్ పటేల్ లు చెరో వికెట్ తీశారు. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ చేసిన 28 పరుగులే అత్యధికం. ఇత ఆధిక్యం ఉన్నప్పటికీ భారత్ బంగ్లాను ఫాలో ఆన్ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగింది.