భారత్ తో జరుగుతున్న 2వ టెస్ట్ లో ఆతిధ్య బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 74 ఓవర్లకు 227 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, రవిచంద్రన్ అశ్విన్ 4, జయదేవ్ ఉనద్కత్ 2 వికెట్లు తీశారు. బంగ్లా బౌలర్లలో మోమినుల్ హక్ (84) అత్యధిక పరుగులు చేశాడు. అతడి తర్వాత ముష్ఫికర్ రహీం 26,లిటన్ దాస్ 25, షాంతో 24 పరుగులు చేశారు.