వచ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపిఎల్ టోర్నీని నిర్వహించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ప్రతీ ఏటా జరిగే ఉమెన్స్ టి20 కప్ స్థానంలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. మొత్తం 6 జట్లతో జరగనున్న ఉమెన్స్ టి20 లీగ్ను పురుషుల ఐపిఎల్ ముగిసిన వెంటనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. పురుషుల ఐపిఎల్ జట్లు ప్లేయర్లను వేలం పద్దతిలో కొనుక్కున్నట్లే మహిళా ఐపిఎల్ మ్యాచ్లకు సైతం ప్రపంచవ్యాప్తంగా ప్లేయర్లను వేలం వేయనున్నారు.