ఇంగ్లాండ్తో గతేడాది రద్దయిన 5వ టెస్ట్ మ్యాచ్కు ముందు సన్నాహాక మ్యాచ్ జరగాల్సిందేనని బిసిసిఐ ఈసీబీని పట్టుబడుతోంది. ‘అవును ప్రాక్టీస్ మ్యాచ్ కావాలన్న ప్లేయర్ల డిమాండ్ మేరకు మేం ఈసీబీతో చర్చిస్తున్నాం. జులై 5న జరగనున్న ఈ 5వ టెస్ట్ మ్యాచ్ కు ముందు వార్మప్ మ్యాచ్ ఉంటే ఇరు జట్లకూ మంచిదే’ అంటూ బిసిసిఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్ తో మాట్లాడుతూ అన్నారు. జులై 7 నుంచి 10 వరకూ 3 టి20లు ఆడనున్న భారత్.. జులై 12–17 మధ్య 3 వన్డేలు ఆడనుంది.