ఐపిఎల్ 15వ సీజన్ క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, ఫైనల్ జరిగే వేదికల్ని బిసిసిఐ సెక్రటరీ జనరల్ జే షా ప్రకటించారు. మే 24, 25 తేదీల్లో జరగనున్న క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించనున్నారు. మే 29న జరగనున్న ఐపిఎల్ ఫైనల్ను అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో క్వాలిఫైయర్ 2ను సైతం అహ్మదాబాద్లోనే నిర్వహించనున్నారు.