తమిళనాడులో ప్రతీ ఏటా జరిగే బిర్యానీ ఫెస్టివల్లో ఈసారి బీఫ్ ను మెనూ కార్డ్ నుంచి తొలగించారు. అయితే దీనిపై స్థానిక ముస్లిం నేతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అంబూర్ టూరిజం ప్రమోషన్లో భాగంగా నేటి నుంచి 15వ తేదీ వరకూ జరిగే ఈ బిర్యానీ ఫెస్టివల్ను అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా అనంతరం ముస్లిం సంఘాల నేతలు ఆ జిల్లా అధికారుల వద్ద బీఫ్ను తిరిగి మెనూలో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.