బెంగాల్ నటి బిడిషా డె మజుందర్ సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 21 ఏళ్ళ బిడిషా కోల్కతాలోని డుమ్ డుమ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని గత 4 నెలలుగా అక్కడే ఉంటున్నారు. అనుభబ్ బేరా అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తున్న నటి.. అది బ్రేకప్ కావడంతో డిప్రెషన్లో ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని ఆమె స్నేహితులు పోలీసులకు వివరించారు. ఈ కేసు విచారణ జరుగుతోందని.. సూసైడ్ నోట్లో మరిన్ని విషయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.