కొవిడ్ వ్యాప్తి విజృంభిస్తుందన్న వార్తల నేపధ్యంలో ప్రజలు మూడో డోస్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ముక్కుతో తీసుకునే కొవిడ్ చుక్కల మందును తయారు చేసిన భారత్ బయోటెక్ దాని ఖరీదును నిర్ణయించింది. ఇంట్రానాజల్ వ్యాక్సిన్ గా పిలిచే ఈ ‘ఇంకోవాక్’ ఒక డోసు ఖరీదు ప్రైవేటు ఆసుపత్రులకు రూ.800లు గానూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.325 గానూ నిర్ణయించింది. జనవరి నాలుగో వారం నుంచి ఈ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.