విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్రం నుంచి రూ.2500 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు కేంద్ర మంత్రి వికె సింగ్.. పార్లమెంట్ లో ప్రకటించారు. జిఎంఆర్ గ్రూప్ ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోందన్న ఆయన.. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయితే విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 ఏళ్ళ పాటు కమర్షియల్ ఫ్లైట్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు.