బర్త్ డే పార్టీలో కొంచెం ఎక్కువ సేపు పెర్ఫార్మెన్స్ చేయడానికి నిరాకరించిందనే కారణంతో ఓ బోజ్ పూరీ సింగర్లు ముఖేష్ యాదవ్, నీలు బెహ్రాల పై బీహార్ లో కాల్పులు జరిపారు. ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చిన ఈ సింగర్లు అక్కడకు వచ్చిన వారంతా తాగి.. తూలుతుండడంతో పెర్ఫార్మెన్స్ చేయడానికి నిరాకరించి బయటకు వచ్చేశారు. దీంతో వారిని బైకులపై వెంబడించిన ప్రోగ్రామ్ కు వచ్చిన ముగ్గురు.. వారిపై పలురౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో సింగర్లు ప్రస్తుతం అర్రే లోని సర్దార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.