ఢిల్లీ నుంచి భువనేశ్వర్ బయలుదేరిన విస్తారా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కావడవంతో తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారని..వారంతా సురక్షితమని డీజీసీఏ ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. 2022లో ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్లైన్స్ ను టాటా గ్రూప్ విలీనం చేసింది.