గడ్కరీ: గాలికి బ్రిడ్జి కూలిందంట

By udayam on May 11th / 5:57 am IST

బీహార్​లో కూలిన ఓ బ్రిడ్జిపై తనకు ఓ ఐఎఎస్​ అధికారి ఇచ్చిన సమాధానం విని షాక్​ అయ్యానని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. బీహార్​ ఐఎఎస్​ అధికారులు సుల్తాన్​గంజ్​ బ్రిడ్జి ప్రమాదానికి బలమైన గాలులే కారణమని చెప్పడం తనను విస్మయానికి గురి చేసిందన్నారు. ఏప్రిల్​ 29న కూలిన ఈ బ్రిడ్జి నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై మాట్లాడిన ఆయన.. అదికారుల తీరుపై మండిపడ్డారు. 3.116 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి కూలడంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ట్యాగ్స్​