కశ్మీర్ లోయలో ముస్లింలను మైనారిటీలుగా మార్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ కొత్త విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. మంత్రిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లోయలోని ముస్లిం సమాజంపై భారత ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని విమర్శించారు. ఆర్టికల్ 370 ని బారత్ అన్యాయంగా అడ్డుకుందన్న భుట్టో.. జనాభా నిష్పత్తిని మార్చాలని చూస్తోందని ఆరోపించారు.