దేశంలోని ఎన్ని మసీదులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కన్నేసిందో ఒకేసారి చెప్పేయాలని జమ్మూ కశ్మీర్ మాజీ సిఎం, పీడిపి పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో 12 అడుగుల శివలింగం బయటపడిందన్న వార్తల నేపధ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీల గురించి అడుగుతున్నారనే మసీదుల వెంట పడుతున్నారని ఆమె విమర్శించారు.