దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై వరుస దాడులు చేస్తున్న ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలను తనకు ఒక్కరోజుకు ఇస్తే సగం మంది బిజెపి నేతలు జైల్లోనే ఉంటారని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ.. అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయన్న ఆయన.. మా మంత్రి మనీష్ సిసోడియా.. లిక్కర్ స్కాంలో రూ.10 కోట్ల అవినీతి చేసినట్లు కనీసం నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆప్ నేతలపై పెట్టిన 200 లకు పైగా తప్పుడు కేసుల్లో 150 వాటికి క్లీన్ చిట్లు వచ్చాయన్నారు.