బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ నేడు తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ధాకడ్ విడుదల సందర్భంగా ఆమె స్వామి వారి సేవకు వచ్చారు. సంప్రదాయ దుస్తులతో కనిపించిన కంగనను చూడానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. తన చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకుంటున్నట్లు ఆమె విలేకరులతో చెప్పారు. ఇటీవల మహేష్బాబు బాలీవుడ్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.