దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక ఆధారాలను పోలీసులు సంపాదించారు. మెహ్రాలి అటవీ ప్రాంతంలో 20 రోజుల క్రితం దొరికిన ఎముకల్లోని డిఎన్ఎ శ్రద్ధా తండ్రి డిఎన్ఎ తో సరిపోతుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో శ్రద్ధావిగా అనుమానిస్తున్న మొత్తం 13 ఎముకలను పోలీసులు సంపాదించారు. ఈ ఏడాది జూన్ లో శ్రద్ధా ను అతడి ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 35 భాగాలుగా నరికి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ శరీర భాగాలను దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో పారేశాడు.