భారత్ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టి20 సిరీస్ చివరి మ్యాచ్ కు ఫామ్ లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు! అతడికి మంగళవారం ఓ మెడికల్ అపాయింట్ మెంట్ ఉండడంతో మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు కోచ్ సూచన ప్రాయంగా వెల్లడించాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండోది భారత్ గెలిచింది. దీంతో 3వ మ్యాచ్ న్యూజిలాండ్ కు చావో రేవోనే. ఇలాంటి మ్యాచ్ కు కేన్ మామ లేకపోవడం ఆ జట్టు పెద్ద ఇబ్బందే!