కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో యుకేలో ఉన్న కరోనా నిబంధనలను ఉల్లంఘించి మందు పార్టీలు చేసుకోవడంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆ దేశ పార్లమెంట్కు క్షమాపణలు చెప్పుకున్నారు. ‘పార్టీ గేట్’ కుంభకోణంగా పిలిచే ఈ విందులపై ఏర్పాటు చేసిన స్యూ గ్రే కమిషన్ తుది నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపధ్యంలో ఆయన తన తప్పును ఒప్పుకంటూ దేశానికి క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి ప్రభుత్వ ప్రాధాన్యాలపై దృష్టి పెడదామని పేర్కొన్నారు.