తమిళనాడులో జరుగుతున్న ప్రతిపక్ష అన్నాడిఎంకె జనరల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస ఏర్పడింది. ఆ పార్టీ కో ఆర్డినేటర్గా ఉన్న పన్నీర్ సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు మంచినీళ్ళ బాటిళ్ళను విసిరి నిరసనను వ్యక్తం చేశారు. మీటింగ్ను బాయ్కాట్ చేసి ఆయన బయటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో పన్నీర్ సెల్వంతోపాటు ఎడప్పాడి కె.పళనిస్వామి సూచించిన 23 ప్రతిపాదనలను జనరల్ కౌన్సిల్ తిరస్కరించింది. పార్టీ ఒకరి నాయకత్వంలోనే ఉండాలన్నది తమ కోరికని జనరల్ కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు.