కరెంట్ కోతలు ఎంత పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టాయో మీరు వింటే నవ్వకుండా ఉండలేరు. ఒకే మండపంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళకు వేర్వేరు వ్యక్తులతో పెళ్ళవుతుండగా కరెంట్ పోయింది.. ముహూర్తం మించిపోతోందని పెళ్ళికొడుకులు తాళి కట్టేసి వారితో ఏడడుగులు కూడా వేసేశారు. ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళాక గానీ చీకట్లో పెళ్ళికూతుర్లు మారిపోయిన విషయం గుర్తించలేదు. ఒకరిని బదులు వేరొకరితో వారి వివాహం జరగడంతో పెద్ద రభసే అయింది. ఆ తర్వాత సెటిల్మెంట్ జరిపి పక్కరోజు మళ్ళీ పెళ్ళి చేశారు.