ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో పుట్టి ఉంటే బాగుంటుందని ఎపి వాసులు భావిస్తున్నారని బ్రదర్ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఏపీ సిఎం వైఎస్ జగన్ కు బావ, షర్మిలకు భర్త అయిన అనిల్ కుమార్ విశాఖ లోని భీమిలో జరిగిన క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దని ప్రజలకు సూచించారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని అన్నారు.