అమర్నాథ్ యాత్రను ధ్వంసం చేసేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్రను భంగం చేశామని బిఎస్ఎఫ్ దళాలు ప్రకటించాయి. ఈనెల 4న భారత్–పాక్ సరిహద్దుల వద్ద ఓ సొరంగాన్ని గుర్తించామని పేర్కొంది. 150 మీటర్ల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉన్న ఈ సొరంగంలో 250 అడుగుల పొడవైన ఆక్సిజన్ పైప్ను కూడా గుర్తించామని బిఎస్ఎఫ్ ట్వీట్ చేసింది. గతవారం జమ్మూలో హతమైన ఇద్దరు సూసైడ్ బాంబర్లు సైతం ఇదే టన్నెల్ ద్వారా దేశంలోకి వచ్చారని పేర్కొంది.