భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ తమ నెట్వర్క్ ద్వారా చేసే ఫోన్ కాల్స్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది.
ఈ పదిశాతం డిస్కౌంట్ను ఉద్యోగులు వాడే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లో కానీ, ఫైబర్ టు ది హోమ్, ల్యాండ్లైన్ విషయంలో కానీ పొందే అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది.
ఇప్పటికే మార్కెట్లో పోటీని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న బిఎస్ఎన్ఎల్ సరికొత్త పథకాలతో వినియోగదారులను పెంచుకోవాలని ప్రయత్నాలు చేపట్టిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఈ సరికొత్త పథకాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.