వైష్ణోదేవి ఆలయానికి భక్తులతో బయల్దేరిన ఓ ప్రయాణికుల బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సులోని నలుగురు దుర్మరణం చెందగా 20 మందికి గాయాలయ్యాయి. వీరంతా జమ్మూలోని కత్రా నుంచి బయల్దేరారు. బస్సు నొమాయి వద్దకు చేరుకోగానే బస్సులో మంటలు వ్యాపించాయని జమ్మూ అడిషనల్ డిజి ముకేష్ సింగ్ తెలిపారు. ప్రమాదానికి అసలు కారణాలను గాలిస్తున్నామన్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురికి ప్రత్యేక చికిత్స అవసరమని పోలీసులు తెలిపారు.