పంత్​ ప్రాణాలు కాపాడిన బస్​ డ్రైవర్​

By udayam on December 30th / 11:56 am IST

డివైడర్​ ను ఢీకొట్టి కారు బోల్తా పడ్డ ఘటనలో తీవ్ర గాయాలపాలైన క్రికెటర్​ రిషబ్​ పంత్​ ను ఓ బస్సు డ్రైవర్​ ప్రాణాలకు తెగించి కాపాడాడు. లేకపోతే మంటలు వ్యాపించిన కారులోంచి పంత్​ బయట పడడం కష్టమైపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్ కు ఢీకొని పల్టీలు కొట్టింది. హర్యానా రోడ్ వేస్ కు చెందిన బస్ డ్రైవర్ సుశీల్​ మాన్​ యాక్సిడెంట్​ ను గమనించి బస్సును పక్కన ఆపి కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు కిటికీ నుంచి పంత్​ ను బయటకు లాగేశాడు. తాను క్రికెటర్​ ను అని, తన తల్లికి కాల్​ చేయమని అతడు నాతో అన్నట్లు చెప్పిన సుశీల్​.. క్రికెట్​ చూడడని.. మీరెవరో తనకు తెలియదని పంత్​ కు బదులిచ్చినట్లు పేర్కొన్నాడు.

ట్యాగ్స్​