తమపై వేస్తున్న టాక్సులు, పెనాల్టీలను తగ్గించాలంటూ వివిధ ఆటో యూనియన్లు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు హైదరాబాద్లో ఆటో రిక్షాలు, క్యాబ్లు, ట్రక్లు బంద్ను పాటిస్తున్నాయి. ఆటో ట్రాలీస్, డిసిఎం వ్యాన్లు, ప్రైవేటు బస్సులు సైతం 24 గంటల బంద్లో పాల్గొంటుండంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయని వాహనాలపై రోజువారీ ఫైన్ రూ.50 ను తక్షణం తొలగించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.