ఈ ఏడాది వర్షాకాలంలో హైదరాబాద్లో వరదలు రావన్న గ్యారెంటీ తాను ఇవ్వలేనని పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ 2021-2022 వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గతేడాది, అంతకు ముందు ఏడాది వచ్చిన వరదలతో పోల్చితే ఈసారి హైదరాబాద్ నగరం కాస్త కోలుకుంటుంది. అయితే ఈ వర్షాకాలంలో నగరంలో వరదలు రావని మాత్రం నేను చెప్పను. గతంతో పోల్చితే కాస్త తగ్గుముఖం పడుతుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు.
పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ 2021-2022 వార్షిక నివేదికను మంత్రి @KTRTRS నేడు విడుదల చేశారు. pic.twitter.com/IvyV4B0OMr
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 3, 2022