భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోనీపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. న్యూగ్లోబల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఛైర్మన్గా ఉన్న ధోనితో పాటు మరో 7 గురిపై బీహర్ కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదయ్యింది. నీరజ్ కుమార్ నిర్మల అనే వ్యక్తి తనను న్యూగ్లోబల్ అనే సంస్థ రూ.38.68 లక్షల మేరకు మోసం చేసిందని కోర్టుకెక్కాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి అజయ్ కుమార్ మిశ్రా ఆ సంస్థ ప్రతినిధులందరిపైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.