మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే నేటి నుంచి హనుమాన్ చాలీసాను పెద్ద శబ్దంతో ప్లే చేస్తామని హెచ్చరిస్తున్న ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేస్తూ.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లజేస్తున్నారని పోలీసులు నోటీసులు ఆయనకు పంపించారు. దీంతో ఈరోజు ముంబైలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.