భారతీయ రైల్వేలో 3.12లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని, దీంతో రైల్వేలో సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాల్ని ఊటంకిస్తూ ఆంగ్ల దినపత్రిక ఒకటి వార్తా కథనం వెలువరించింది. సిబ్బంది కొరత వల్ల రైల్వేలో ఉద్యోగులపై పని ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉందని, ఓవర్టైమ్ పనిచేయాల్సి వస్తోందని తెలిపింది. (ఇంకా చదవండి)
రెండు దురదృష్టకర సంఘటనలతో టాటా గ్రూపుకు చెందిన ఎయిర్ ఇండియా మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే తరహా మరో ఘటనకు చోటు ఇవ్వరాదన్న ఉద్దేశ్యంతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దురుసు ప్రవర్తనతో కూడిన ప్రయాణికుల గురించి వెంటనే సమాచారం అందించాలంటూ క్యాబిన్ క్రూ సిబ్బందికి ఆదేశాలు (ఇంకా చదవండి)
ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ జోషిమఠ్ పై సంచలన నివేదిక ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రాంతం ప్రతీ ఏటా ఆరున్నర సెంటీమీటర్ల వరకూ భూమిలోకి కుంగిపోతోందని ఉపగ్రహ ఛాయా చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు తేల్చారు. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కుంగిపోతూనే ఉన్నాయని తెలిపారు. (ఇంకా చదవండి)
జమ్మూ-కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా డోరూ బ్లాకులోని టెథన్ గ్రామ ప్రజలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు విద్యుత్తు సౌకర్యాన్ని పొందారు. ఇన్నేళ్లు కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తుల మధ్యే రాత్రిళ్లు గడిపిన ఆ పల్లెవాసులు తొలిసారిగా లైటు వెలగడం చూశారు. అధికారులు ఎంతో కష్టపడి కొండ ప్రాంతంలో ఉన్న ఈ (ఇంకా చదవండి)
దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మరోసారి చెత్త రికార్డును అందుకుంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం – ఎన్సీఏపీ 2022 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక్కడి గాలిలో సూక్ష్మధూళి కణ కాలుష్యం 2.5 పీఎం స్థాయులు సురక్షిత పరిమితి కంటే రెట్టింపు ఉన్నట్లు ఈ (ఇంకా చదవండి)
కాంగ్రెస్ నేత రాహుల్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర బుధవారం పంజాబ్లో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన అమృతసర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్సింగ్ రాజా వారింగ్, ప్రతిపక్ష నేత పర్తాప్ సింగ్ భజ్వా, స్ధానిక ఎంపి గుర్జీత్ సింగ్ ఔజ్లా, ఇతర పార్టీ (ఇంకా చదవండి)
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి మరో వివాదానికి ఆజ్యం పోశారు. రాజ్భవన్లో జరిగే సంక్రాంతి వేడుకలకు హాజరవ్వాలంటూ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఆహ్వానపత్రిక పంపారు. అయితే తమిళ నాడు ప్రభుత్వం బదులుగా ‘తమిళగం అజునర్ ‘ అని ఆహ్వాన పత్రికలో పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. గవర్నర్ ఆహ్వాన పత్రికలో రాష్ట్ర (ఇంకా చదవండి)
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో మాదిరిగా యుపిలోనూ కొన్ని భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. బుధవారం అలీఘర్లోని కన్వరిగంజ్ ప్రాంతంలో దాదాపు 50 ఇళ్లకు అకస్మాత్తుగా పగుళ్లు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఇది జాతీయ విపత్తు కాదని.. స్మార్ట్ సిటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పైప్లైన్ లీకేజ్ కావడంతో (ఇంకా చదవండి)
దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ వెల్లడించింది. పృథ్వీ సిరీస్లో రూపొందించిన ఈ బాలిస్టిక్ మిస్సైల్తో (ఇంకా చదవండి)