డబ్బు తీసుకుని చైనీయులకు వీసాలు ఇచ్చారన్న కేసులో కార్తి చిదంబరం సన్నిహితుడు, అతడి పర్సనల్ ఆడిటర్ ఎస్.భాస్కరరామ్ను సీబీఐ ఈరోజు అరెస్ట్ చేసింది. మంగళవారం దేశ మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం ఇంట్లో జరిపిన సోదాల్లో దొరికిన ఆధారాల మేరకు భాస్కర రామ్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 2011లో రూ.50 లక్షల లంచం తీసుకుని 263 మంది చైనీయులకు పంజాబ్లోని తల్వాండీ సాబో పవర్ లిమిటెడ్లో పనిచేసేందుకు వీసాలు పునరుద్దరణ చేసినట్లు కార్తీ చిదంబరంపై కొత్త కేసు దాఖలైంది.