సిమెంట్​ ధరలూ పైపైకే.. ఎంత పెరిగాయంటే!

By udayam on June 3rd / 5:29 am IST

తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్​ ధరలు భారీగా పెరిగాయి. 50 కేజీల బస్తా ధరను రూ.20–30 వరూ కంపెనీలు పెంచేశాయి. నిన్నటి నుంచే ఈ పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. ఇంధన వ్యయాలు పెరగడంతో పాటు ముడి పదార్థాల కొరత, ఉన్న వాటి రేట్లు భారీగా పెరగడం కూడా సిమెంట్​ ధరల పెంపులో కీలకంగా మారాయి. దీంతో అల్ట్రాటెక్​ సిమెంట్​, ఇండియా సిమెంట్స్​, కేవీపీ, ఎన్​సీఎల్​ ఇండస్ట్రీస్​, సాగర్​ సిమెంట్స్​, దాల్మియా భారత్​, శ్రీ సిమెంట్​, రామ్​ కో సిమెంట్స్​ కంపెనీలు ధరలు పెంచేశాయి.

ట్యాగ్స్​