రబీ ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే ఆరుసార్లు గడువు పొడిగించిన కేంద్రం తాజాగా ఈ ధాన్యం కొనుగోలుకు చివరి తేదీని ఈనెల 31 వరకూ పొడిగించింది. గతనెల 18న ధాన్యం కొనుగోలు చివరి తేదీని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా.. తాజాగా కేంద్రం దానికి అంగీకరించింది. దీంతో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్కు మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.