ప్రతి ఏడాది సంక్రాంతి వేడుకలను జరుపుకోవడానికి నారా, నందమూరి కుటుంబాలు టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపాలెంకు వెళ్లడం ఆనవాయతీ. ఇరు కుటుంబాలు సంక్రాంతిని నారావారిపాలెంలో ఘనంగా జరుపుకుంటాయి. ఈ సంక్రాంతికి కూడా నారావారిపాలెంకు వెళ్లడానికి ఇరు కుటుంబాలు సిద్దమయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు వీరు నారావారిపాలెంకు వెళ్లలేదు. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులో ఉన్న తరుణంలో ఇరు కుటుంబాలు సంక్రాంతి వేడుకలకు సిద్ధమయ్యాయి.