వైఎస్ జగన్ చేతకాని పాలన వల్ల ఎపి పరువు గంగపాలయ్యిందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వం చెత్తపై, డ్రైనేజీపై, పెట్రోల్పైనా పన్నులు వేసి ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందని విమర్శించారు. కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయయని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.