మాజీ మంత్రి నారాయణ అరెస్ట్పై మాజీ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్లకు లేఖలు రాశారు. కేవలం రాజకీయ కక్షలతోనే నారాయణను ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అనంతరం హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలించడంలో జాప్యం వెనుక మాకు అనుమానాలున్నాయన్న ఆయన ముందస్తు నోటీసులు కూడా లేకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చిత్తూరు పోలీసులు నారాయణ సతీమణికి ఇచ్చి లేఖ ప్రతిని తన లేఖకు జతచేసి పంపించారు.