చంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ను నేషనల్ హైవే 44 వరకూ పొడిగిస్తూ ‘సాగుతున్న’ పనులు వచ్చే నెల చివరి నాటికి పూర్తవనున్నాయి. 2018లో మొదలైన ఈ ప్రాజెక్ట్కు కొవిడ్ 19, 2020లో వచ్చిన వదరలు సైతం తోడై ఆలస్యమవుతూ వస్తోంది. రూ.47 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్ ఫలక్నుమా నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ పనుల కారణంగా ఫలక్నుమా వద్ద ప్రతీరోజూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.