సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత ఆటగాళ్ళైన చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్లు రికార్డులు నెలకొల్పారు.
టెస్టుల్లో భారత్ తరపున 6 వేల పరుగులు పూర్తి చేసిన 11వ బ్యాట్స్మెన్ పుజారా రికార్డు నమోదు చేశాడు. 32 ఏళ్ళ పుజారా 134 ఇన్నింగ్స్లో ఈ రికార్డును అందుకున్నాడు.
అతని కంటే ముందు గవాస్కర్ (117 ఇన్నింగ్స్లు), కోహ్లీ (119), సచిన్ టెండుల్కర్ (120), వీరేంద్ర సెహ్వాగ్ (123) రాహుల్ డ్రావిడ్ (125) ఇన్నింగ్స్లో ఈ రికార్డును అందుకుంటే ఇప్పుడు పుజారా ఈ 134 ఇన్నింగ్స్ల్లో ఈ రికార్డును అందుకున్నాడు.
మూడో టెస్ట్ ఆఖరు రోజు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సైతం అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
ఆస్ట్రేలియాలో నాలుగో ఇన్నింగ్స్లో 50 పరుగులు చేసిన పంత్ ఆ ఘనత సాధించిన అత్యంత చిన్న వయసు వికెట్ కీపర్గా నిలిచాడు.
ఎప్పుడూ మిడిల్ ఆర్డర్లో అడుగున వచ్చే పంత్ ఈసారి 3వ వికెట్ పడిన వెంటనే బ్యాటింగ్కు రావడంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం లభించింది. దీంతో అతడు కేవలం 118 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు.
పంత్ కేవలం 23 సంవత్సరాల 95 రోజుల వయసులోనే ఈ రికార్డును అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఇయాన్ హీలీ పేరిట ఉంది. అతడు 24 ఏళ్ళ 216 రోజుల వయసులో ఈ రికార్డును నెలకొల్పాడు.