గతేడాది భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియోను చైనా విడుదల చేసింది.
An on-site video reveals in detail the four #PLA martyrs and other brave Chinese soldiers at the scene of the Galwan Valley border clash with India in June 2020. https://t.co/hSjP3hBnqr pic.twitter.com/g6zNpT1IrX
— Global Times (@globaltimesnews) February 19, 2021
చైనా అధికార వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ విడుదల చేసిన ఈ వీడియోలో చైనా సైనికులు, భారత సైనికులు ఉద్రిక్త పరిస్థితుల్లో ఎదురెదురుగా ఉండడం కనిపిస్తోంది.
కారకోరం పర్వత శ్రేణుల్లో ఇరు వైపులా సైనికులు ఒకరిపై ఒకరు దూసుకురావడంతో పాటు పాంగాంగ్ సరస్సు వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వీడియోలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.
ఈ ఘర్షణల్లో భారత్ వైపు నుంచి 20 మంది సైనికులు మరణించగా, చైనా తమ వైపు 5 గురు సైనికులే మరణించినట్లు చెప్పుకొంటోంది.
తాజాగా లడఖ్ వేదికగా భారత, చైనా సైనిక అధికారుల మధ్య పదో విడత కమాండర్ స్థాయి చర్చలు జరుగుతుండగా ఈ వీడియోను రిలీజ్ చేయడం ఆర్మీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.