ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద చైనా సైనికుల ఆక్రమణకు, ఈ ప్రాంతంలో పెరిగే ఫంగస్ కు కారణం ఉందంటోంది ఇండో–పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (ఐపిసిఎస్సీ) సంస్థ. ఇక్కడ దొరికే హిమాలయా గోల్డ్ ఫంగస్ కోసమే చైనా ఈ ప్రాంతంపై కన్నేసిందన్న సంచలన నివేదికను ఈ సంస్థ ప్రచురించింది. ఇది బహిరంగ మార్కెట్ లో బంగారం కంటే విలువైనదని పేర్కొంది. అత్యంత ఔషద గుణాలున్న ఈ ఫంగస్ కు ఔషద మార్కెట్ లో భారీ ధర పలుకుతుంది. 10 గ్రాముల ఫంగస్ ధర రూ.60 వేలు ఉంటుంది.