నిన్న వాల్తేరు వీరయ్య చిత్రబృందం అధికారిక ప్రెస్ మీట్ లో మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసే వార్తను వెల్లడించారు. ఇప్పటికే కొడుకు రామ్ చరణ్ తో నటించిన ఆయన.. త్వరలోనే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటించనున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ రాబోయే రెండేళ్ళలోనే పట్టాలెక్కుతుందని భావిస్తున్నట్లు స్వయంగా చిరంజీవినే చెప్పారు. ఈ సినిమాలో రవితేజ తో కలిసి పనిచెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఇతర హీరోలతో కలిసి నటించే ఆలోచన కూడా తనకు ఉన్నట్టు తెలిపారు.