మెగాస్టార్ చిరంజీవి – శృతి హాసన్ జంటగా మాస్ రాజా రవితేజ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ఎడిటింగ్ పనులను పూర్తి చేసారు మేకర్స్. ఈ చిత్రానికి ఫైనల్గా 2 గంటల 30 నిమిషాల నిడివితో రాబోతుందని తెలుస్తుంది. ఇది డీసెంట్ రన్ టైం అని చెప్పాలి.