మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పొలిటికల్ డ్రామా ‘గాడ్ ఫాదర్’ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి, సత్యదేవ్, నయనతార, మురళీశర్మ, సునీల్, షఫీ, అనసూయా భరద్వాజ్, దివి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించారు. థమన్ సంగీతం అందించారు. ధియేట్రికల్ రన్ ను లాస్ తో పూర్తి చేసుకున్న ఈ మూవీ డిజిటల్ ఎంట్రీలో మాత్రం దుమ్మురేపింది. ఇప్పుడు టెలిజినల్ లోనూ రాణించడానికి సిద్ధమైంది.