10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెలికాఫ్టర్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని ఛత్తీస్ఘడ్ సిఎం భూపేష్ చెప్పారు. విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్న ఆయన గురువారం రాజ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాని ఎఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. పిల్లలకు విమానంలో ప్రయాణించాలని ఉంటుంది. మంచి మార్కులు సాధించిన వారికి మేం ఆ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.